BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

వృద్ధురాలు పోగొట్టుకున్న రూ. 25 వేల నగదును రికవరీ చేసి అప్పగింత

తెలంగాణ
/ ఖమ్మం
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
22 Mar, 2026 - 08:26 AM
50 వీక్షణలు

వృద్ధురాలు పోగొట్టుకున్న రూ. 25 వేల నగదును రికవరీ చేసి అప్పగింత

మధిర: ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మధిర పట్టణ పోలీసులు తమ ఉదారతను చాటుకున్నారు. పొరపాటున రోడ్డుపై రూ. 25 వేల నగదు పోగొట్టుకున్న ఓ వృద్ధురాలికి, సిసి కెమెరాల సాయంతో ఆ సొమ్మును తిరిగి అప్పగించి బాధితురాలి కళ్లలో ఆనందం నింపారు.

​పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధిర పట్టణం ఎస్సీ కాలనీకి చెందిన దారమల్ల కనకమ్మ (70) అనే వృద్ధురాలు శుక్రవారం ఉదయం పట్టణంలోని ఆకృతి వస్త్ర దుకాణం సమీపంలో టీ తాగేందుకు వెళ్ళింది. ఆ సమయంలో ఆమె వెంట తెచ్చుకున్న రూ. 25,000 నగదు పొరపాటున రోడ్డుపై పడిపోయింది. తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో డబ్బులు లేవని గుర్తించిన ఆమె, టీ షాపు వద్దకు వచ్చి వెతికినప్పటికీ ఫలితం లేకపోయింది.

​దీంతో బాధితురాలు మధిర పట్టణ సీఐ దోమల రమేష్ కి ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సీఐ.. బ్లూకోట్ సిబ్బంది బాణావత్ కొండ మరియు హోంగార్డ్ మధులను రంగంలోకి దింపారు. వారు ఆ ప్రాంతంలోని సిసి కెమెరా ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, రోడ్డుపై పడి ఉన్న నగదును తీసుకున్న వ్యక్తిని గుర్తించారు. అతని నుండి నగదును రికవరీ చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు.

​అనంతరం సీఐ దోమల రమేష్, ఎస్సై నవిత మరియు బ్లూకోట్ సిబ్బంది సమక్షంలో ఆ రూ. 25,000 నగదును వృద్ధురాలు కనకమ్మకు అప్పగించారు. తన కష్టార్జితాన్ని తక్షణమే వెతికి పెట్టినందుకు కనకమ్మ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా సమయస్ఫూర్తితో వ్యవహరించి నగదును రికవరీ చేసిన బ్లూకోట్ కానిస్టేబుల్ కొండ మరియు హోంగార్డ్ మధులను సీఐ అభినందించారు.