www.ntodaynews.com
మహానాడు రెండో రోజు కార్యక్రమానికి చనుబండ నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు
ఆంధ్రప్రదేశ్
/
ఏలూరు
ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నక్కా రాము ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో జరుగుతున్న రెండవ రోజు మహానాడు కార్యక్రమానికి చనుబండ గ్రామం నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీగా బయలుదేరారు. మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు. పార్టీ అధినాయకత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతుగా పెద్ద ఎత్తున తరలివెళ్లిన కార్యకర్తల్లో ఉత్సాహం కనిపించింది.