BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

మమతకు షాక్.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రితబ్రత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 06:29 AM
54 వీక్షణలు

కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన ఛాంబర్ తాళాలను కూడా అసెంబ్లీ సిబ్బంది రితబ్రతకు అందజేశారు.

ఇటీవల అసెంబ్లీలో పార్టీ నేతగా శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్ను ఎంపిక చేయడంపై టీఎంసీలో విభేదాలు బయటపడ్డాయి. ఆయన నాయకత్వాన్ని అంగీకరించబోమంటూ 80 మంది ఎమ్మెల్యేల్లో 59 మంది తిరుగుబాటు స్వరం వినిపించారు. అనంతరం రితబ్రత నేతృత్వంలోని ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి, తమకే మెజారిటీ మద్దతు ఉందని, రితబ్రతను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ రితబ్రతకు ప్రతిపక్ష నేత హోదా కల్పించారు. అయితే, తాము ఇంకా మమతా బెనర్జీ నాయకత్వాన్నే అంగీకరిస్తున్నామని రితబ్రత స్పష్టం చేశారు. పార్టీని చీల్చే ఉద్దేశం తమకు లేదని తెలిపారు.

మరోవైపు, శోభన్‌దేబ్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే, ఆ లేఖలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రితబ్రత, సాందీపన్ ఆరోపించడంతో స్పీకర్ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో శోభన్‌దేబ్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు.