BREAKING
ఎస్పి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్(SB)సిఐ బండారు సురేష్ పై వేటు... కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్ దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ ఎస్పి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్(SB)సిఐ బండారు సురేష్ పై వేటు... కొత్తగా పెన్షన్ కొరకు దరఖాస్తు చేయుటకు కావాల్సిన డాకుమెంట్స్ దేవవరం గ్రామ పార్టీ అధ్యక్షులు కొరిమి సూర్య గణేష్ సత్యనారాయణ ని వెంకటేష్ పరామర్శించారు.. సిఐ చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి శాశ్వతంగా డిస్మిస్ చేస్తూ ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ.. వెన్నుపోటుకు రెండేళ్లు: కూటమి వైఫల్యాలపై రేపటి నుంచి నిరసనలు లలిత ఆసుపత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్న: ప్రముఖ వైద్యులు కొమ్మినేని వీరశంకర్ రావు,డాక్టర్ రేష్మా డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచిన వైయస్ జగన్ నాగార్జున సాగర్ కాలువల నిర్వహణ పనులకు రూ.42.19 కోట్లు మంజూరు అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాముల్ని చేయండి : ప్రత్తిపాటి చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు పోస్టర్ ఆవిష్కరణ
www.ntodaynews.com

మమతకు షాక్.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రితబ్రత

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jun, 2026 - 06:29 AM
22 వీక్షణలు

కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీఎంసీ రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీకి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తూ స్పీకర్ రతీంద్ర బోస్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపక్ష నేతకు కేటాయించిన ఛాంబర్ తాళాలను కూడా అసెంబ్లీ సిబ్బంది రితబ్రతకు అందజేశారు.

ఇటీవల అసెంబ్లీలో పార్టీ నేతగా శోభన్‌దేబ్ ఛటోపాధ్యాయ్ను ఎంపిక చేయడంపై టీఎంసీలో విభేదాలు బయటపడ్డాయి. ఆయన నాయకత్వాన్ని అంగీకరించబోమంటూ 80 మంది ఎమ్మెల్యేల్లో 59 మంది తిరుగుబాటు స్వరం వినిపించారు. అనంతరం రితబ్రత నేతృత్వంలోని ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కలిసి, తమకే మెజారిటీ మద్దతు ఉందని, రితబ్రతను ప్రతిపక్ష నేతగా గుర్తించాలని కోరారు.

ఈ నేపథ్యంలో స్పీకర్ రితబ్రతకు ప్రతిపక్ష నేత హోదా కల్పించారు. అయితే, తాము ఇంకా మమతా బెనర్జీ నాయకత్వాన్నే అంగీకరిస్తున్నామని రితబ్రత స్పష్టం చేశారు. పార్టీని చీల్చే ఉద్దేశం తమకు లేదని తెలిపారు.

మరోవైపు, శోభన్‌దేబ్‌ను ప్రతిపక్ష నేతగా గుర్తించాలంటూ టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పీకర్‌కు లేఖ రాశారు. అయితే, ఆ లేఖలో తమ సంతకాలను ఫోర్జరీ చేశారని రితబ్రత, సాందీపన్ ఆరోపించడంతో స్పీకర్ ఆ అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో శోభన్‌దేబ్‌కు ప్రతిపక్ష నేత హోదా దక్కలేదు.