www.ntodaynews.com
మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మంచిర్యాల
మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
మంచిర్యాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలి: ఎంపీ గడ్డం వంశీకృష్ణ
అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద మంచిర్యాల (MNCL) 'ఏ-గ్రేడ్' రైల్వే స్టేషన్ ఆధునీకరణకు కేటాయించిన రూ. 26.49 కోట్ల నిధులు ప్రస్తుత అవసరాలకు సరిపోవని, స్టేషన్ స్థాయికి తగినట్లుగా అదనపు నిధులు మంజూరు చేయాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వానికి విన్నవించారు. 2024 ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ఈ పనులను ప్రారంభించగా, రామగుండం స్టేషన్ పనుల ప్రభావం వల్ల మంచిర్యాలలో కొంత జాప్యం జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల అధికారుల పర్యటనతో పనులు వేగం పుంజుకున్నప్పటికీ, స్టేషన్ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధుల అవసరం ఉందని, ఈ మేరకు కేంద్రానికి విన్నవించినట్లు ఎంపీ పేర్కొన్నారు