మంచిర్యాలలో మెగా జాబ్ మేళా: హెటిరో, న్యూల్యాండ్ ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు
రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 1న నిర్వహణ
ఉచిత వసతి, క్యాంటీన్ సౌకర్యంతో పాటు ఉచిత B.Sc డిగ్రీ చదివే అవకాశం
మంచిర్యాల: రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా కంపెనీలైన హెటిరో ల్యాబ్స్ మరియు న్యూల్యాండ్లలో 'టెక్నికల్ ట్రైనీ' ఉద్యోగాల భర్తీకై జూన్ 1వ తేదీన ఉదయం 9:30 గంటలకు మంచిర్యాల జన్మభూమి నగర్లోని ఎథిక్ అకాడమీలో భారీ మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. ఈ మేళాలో పాల్గొనడానికి MPC, BiPC, ఫార్మా టెక్, MLT (బ్రిడ్జ్ కోర్స్తో), లేదా B.Sc కెమిస్ట్రీ (పాస్/ఫెయిల్/పర్స్యూయింగ్) చదివి, పదో తరగతిలో 60%, ఇంటర్లో 55% మార్కులతో 2025, 2026 లలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి హైదరాబాద్లో ఉద్యోగంతో పాటు నెలకు రూ. 12,500/- వేతనం, రెండేళ్ల పాటు ఉచిత వసతి, సబ్సిడీ క్యాంటీన్, రవాణా సౌకర్యాలు లభిస్తాయి; అంతేకాకుండా TISS విశ్వవిద్యాలయం ద్వారా ఉచితంగా B.Sc డిగ్రీ చదివే అవకాశాన్ని కంపెనీలే స్పాన్సర్ చేస్తాయి. నిరుద్యోగ యువత ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు, మరిన్ని వివరాలకు 8121043322, 8142194787 నంబర్లను సంప్రదించవచ్చు