మంచిర్యాలలో ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు
మంచిర్యాల:-బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల నియోజకవర్గ ముస్లిం సోదరులకు మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ గార్లు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న ఖదీమ్ ఈద్గాతో పాటు క్వారీ రోడ్ (అండలమ్మ కాలనీ) లోని మసీదులను వారు సందర్శించి, అక్కడ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న ముస్లింలకు పండగ శుభాకాంక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మంచిర్యాల పట్టణ మాజీ అధ్యక్షులు గాదె సత్యం, మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, సీనియర్ నాయకులు గోగుల రవీందర్ రెడ్డి, ఎర్రం తిరుపతి, కార్పొరేటర్ పెట్టం స్వరూప-లక్ష్మణ్, అబ్దుల్ సత్తార్, మాజీ కౌన్సిలర్లు వంగ తిరుపతి, పల్లె రాజన్నలతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, టీబీజీకేఎస్ (TBGKS) నాయకులు మరియు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు