మఠంగూడెంలో రహదారి మరమ్మతులు – ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తక్షణ స్పందన
మండల రిపోర్టర్ కుడిపుడి సత్తి బాబు
ఏలూరు జిల్లా, లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామంలో రహదారి సమస్యపై స్థానికులు చేసిన వినతికి చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ వెంటనే స్పందించారు.
ఏలూరు–చింతలపూడి ప్రధాన రహదారిలో గుంతల కారణంగా ప్రయాణికులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే తారు రహదారి మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో సంబంధిత అధికారులు రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభించారు.
ఈ పనులను టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు తుంపాటి కిషోర్, లింగపాలెం మండల బీసీ సెల్ అధ్యక్షులు తాళం సోమ్ బాబు ప్రత్యక్షంగా పర్యవేక్షించారు.
తక్షణ చర్యలతో రహదారి సమస్య పరిష్కారానికి ముందడుగు వేసినందుకు గ్రామస్తులు, వాహనదారులు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు.