BREAKING
పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు
www.ntodaynews.com

​ముల్కల్ల ఇసుక రీచ్‌ను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

తెలంగాణ
/ మంచిర్యాల / హాజీపూర్
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
19 Jun, 2026 - 07:32 PM
131 వీక్షణలు

మన ఇసుక వాహనం యాప్ ద్వారానే ఇసుక తరలింపు ​ఓటీపీ లేని ట్రాక్టర్లకు అనుమతి లేదు

​మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని ముల్కల్లలో గల ఇసుక రీచ్‌ను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్వయంగా సందర్శించి, అక్కడ జరుగుతున్న ఇసుక తరలింపు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'మన ఇసుక వాహనం' యాప్ ద్వారా అధికారికంగా ఇసుకను బుక్ చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే ఇసుకను తరలించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇసుకను రవాణా చేసినట్లైతే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన గట్టిగా హెచ్చరించారు.

​ఇసుక రవాణాలో పారదర్శకతను పాటించాలని, ఓటీపీ లేని ఏ ఒక్క ట్రాక్టర్‌ కూడా ఇసుక రీచ్ నుంచి బయటకు వెళ్లకూడదని కలెక్టర్ అధికారులను కచ్చితంగా ఆదేశించారు. నిబంధనలను పకడ్బందీగా అమలు చేసి అక్రమాలను అరికట్టాలని ఆయన సూచించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో వివిధ శాఖల సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు