BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు..

తెలంగాణ
/ ములుగు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 01:32 PM
149 వీక్షణలు

ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు.. నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేత

ములుగు జిల్లా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పరిధిలో ప్రహరీ గోడ నిర్మాణ పనుల సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తవ్వకాల్లో కాకతీయుల కాలం నాటి పురాతన శిలలు బయటపడిన క్రమంలో, వాటి సమీపంలో మూడు తెల్ల రంగు పాములు కనిపించాయని కార్మికులు తెలిపారు.

రూ.24 కోట్ల వ్యయంతో 8.4 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మాణం కొనసాగుతుండగా, భారీ రాళ్లు అడ్డుగా రావడంతో జేసీబీతో తొలగించే ప్రయత్నం చేశారు. ఆ రాళ్లు పురాతన ఆలయ నిర్మాణానికి చెందిన శిలలుగా గుర్తించినట్లు సమాచారం.

అదే సమయంలో మూడు తెల్ల పాములు బయటకు వచ్చాయని, వాటిలో ఒకటి జేసీబీ బకెట్ తగలడంతో మృతి చెందిందని చెబుతున్నారు. మిగిలిన రెండు పాములు అక్కడి నుంచి వెళ్లిపోయాయని సమాచారం.

ఈ ఘటన అనంతరం జేసీబీ యంత్రం అకస్మాత్తుగా మొరాయించడంతో సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. సాంకేతిక లోపమా లేదా యాదృచ్ఛిక సంఘటననా అనే దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పరిస్థితిని గమనించిన కాంట్రాక్టర్ సిబ్బంది తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. బయటపడిన శిలల ఆధారంగా అక్కడ పురాతన ఆలయ అవశేషాలు ఉండే అవకాశం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది.

ఈ అంశంపై పురావస్తు శాఖ పరిశీలన అవసరమని స్థానికులు సూచిస్తున్నారు.