BREAKING
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుపై హర్షం ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు.. లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం కలగరలో రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహణ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని కందుకూరు ఆర్డీవో, మండల తహసిల్దార్ నక్కపల్లి రహదారిపై ప్రమాదం.... ఐకేపీ కేంద్రాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ఎన్.టి.ఆర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఏర్పాటుపై హర్షం ఏలూరు జిల్లా చింతలపూడిలో గ్యాస్ సరఫరా అంతరాయం ఏపీలో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎర్రబ్యాడ్జీలతో నిరసనలు ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు.. లంచ్ బాక్స్‌తో సచివాలయానికి.. సాధారణ ఉద్యోగిలా సీఎం కలగరలో రీ సర్వేపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహణ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాలను పట్టించుకోని కందుకూరు ఆర్డీవో, మండల తహసిల్దార్ నక్కపల్లి రహదారిపై ప్రమాదం.... ఐకేపీ కేంద్రాల్లో నకిరేకల్ ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ.
www.ntodaynews.com

ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు..

తెలంగాణ
/ ములుగు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 01:32 PM
41 వీక్షణలు

ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు.. నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేత

ములుగు జిల్లా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పరిధిలో ప్రహరీ గోడ నిర్మాణ పనుల సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తవ్వకాల్లో కాకతీయుల కాలం నాటి పురాతన శిలలు బయటపడిన క్రమంలో, వాటి సమీపంలో మూడు తెల్ల రంగు పాములు కనిపించాయని కార్మికులు తెలిపారు.

రూ.24 కోట్ల వ్యయంతో 8.4 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మాణం కొనసాగుతుండగా, భారీ రాళ్లు అడ్డుగా రావడంతో జేసీబీతో తొలగించే ప్రయత్నం చేశారు. ఆ రాళ్లు పురాతన ఆలయ నిర్మాణానికి చెందిన శిలలుగా గుర్తించినట్లు సమాచారం.

అదే సమయంలో మూడు తెల్ల పాములు బయటకు వచ్చాయని, వాటిలో ఒకటి జేసీబీ బకెట్ తగలడంతో మృతి చెందిందని చెబుతున్నారు. మిగిలిన రెండు పాములు అక్కడి నుంచి వెళ్లిపోయాయని సమాచారం.

ఈ ఘటన అనంతరం జేసీబీ యంత్రం అకస్మాత్తుగా మొరాయించడంతో సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. సాంకేతిక లోపమా లేదా యాదృచ్ఛిక సంఘటననా అనే దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పరిస్థితిని గమనించిన కాంట్రాక్టర్ సిబ్బంది తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. బయటపడిన శిలల ఆధారంగా అక్కడ పురాతన ఆలయ అవశేషాలు ఉండే అవకాశం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది.

ఈ అంశంపై పురావస్తు శాఖ పరిశీలన అవసరమని స్థానికులు సూచిస్తున్నారు.