BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు..

తెలంగాణ
/ ములుగు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 01:32 PM
189 వీక్షణలు

ములుగు జిల్లాలో పురాతన శిలల వద్ద మూడు తెల్ల పాములు.. నిర్మాణ పనులు తాత్కాలికంగా నిలిపివేత

ములుగు జిల్లా సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ పరిధిలో ప్రహరీ గోడ నిర్మాణ పనుల సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తవ్వకాల్లో కాకతీయుల కాలం నాటి పురాతన శిలలు బయటపడిన క్రమంలో, వాటి సమీపంలో మూడు తెల్ల రంగు పాములు కనిపించాయని కార్మికులు తెలిపారు.

రూ.24 కోట్ల వ్యయంతో 8.4 కిలోమీటర్ల మేర ప్రహరీ గోడ నిర్మాణం కొనసాగుతుండగా, భారీ రాళ్లు అడ్డుగా రావడంతో జేసీబీతో తొలగించే ప్రయత్నం చేశారు. ఆ రాళ్లు పురాతన ఆలయ నిర్మాణానికి చెందిన శిలలుగా గుర్తించినట్లు సమాచారం.

అదే సమయంలో మూడు తెల్ల పాములు బయటకు వచ్చాయని, వాటిలో ఒకటి జేసీబీ బకెట్ తగలడంతో మృతి చెందిందని చెబుతున్నారు. మిగిలిన రెండు పాములు అక్కడి నుంచి వెళ్లిపోయాయని సమాచారం.

ఈ ఘటన అనంతరం జేసీబీ యంత్రం అకస్మాత్తుగా మొరాయించడంతో సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. సాంకేతిక లోపమా లేదా యాదృచ్ఛిక సంఘటననా అనే దానిపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పరిస్థితిని గమనించిన కాంట్రాక్టర్ సిబ్బంది తాత్కాలికంగా పనులు నిలిపివేశారు. బయటపడిన శిలల ఆధారంగా అక్కడ పురాతన ఆలయ అవశేషాలు ఉండే అవకాశం ఉందని స్థానికంగా చర్చ సాగుతోంది.

ఈ అంశంపై పురావస్తు శాఖ పరిశీలన అవసరమని స్థానికులు సూచిస్తున్నారు.