www.ntodaynews.com
మండల కేంద్రంలో మే డే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు
తెలంగాణ
బొమ్మలరామారం మండల కేంద్రంలో మే డే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు
NTODAY NEWS: బొమ్మలరామారం మండలం
బొమ్మలరామారం మండల కేంద్రంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఘనంగా మే డే ప్రపంచ కార్మిక దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల సిపిఐ కార్యదర్శి అన్నేమైన వెంకటేశం పాల్గొని సిపిఐ జెండా ఎగరవేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికుల చెమట కష్టం బంగార కన్న ఎక్కువ వజ్రం కన్నా క్రాంతి వంతమైనది అని అన్నారు శ్రామికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేశారు 50 సంవత్సరాలు పై ఉన్న కార్మికులకు ప్రభుత్వం 3000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి అని అన్నారు కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికులకు అందరికీ ఇన్సూరెన్స్, ప్రమాద బీమా ఈఎస్ఐ పథకాలు లేనివారికి వెంటనే అమలు చేయాలి అని అన్నారు ప్రతి కార్మికునికి ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వడ్లకొండ భారతమ్మ, పిట్టల శంకర్, ఎనగళ్ల రాజప్ప, ఎడ్జెర్ల సాయిలు, వేణుగోపాల్, తుమ్మల జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube