www.ntodaynews.com
నాగపల్లి నరసింహస్వామి సన్నిధిలో మంత్రి
తెలంగాణ
నాగపల్లి నరసింహస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
వెల్గటూర్, మండలంలోని కిషన్ రావు పేట గ్రామంలో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాగపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం సందర్శించారు.
ఘన స్వాగతం
ఆలయానికి చేరుకున్న మంత్రికి ఆలయ అర్చకులు మరియు కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ఆయన ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారు.
ప్రత్యేక పూజలు
ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ మొక్కులు చెల్లించుకున్నారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు మంత్రికి స్వామివారి శేషవస్త్రం కప్పి తీర్థప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు, స్థానిక నాయకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#Nagapalli #LakshmiNarasimhaSwamy #AdluriLakshmanKumar #TempleVisit #TelanganaNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube