చాట్రాయి మండలానికి చెందిన ఆరుగురు పాత నేరస్తుల బైండ్ ఓవర్
నవోదయం–2.0 కార్యక్రమంలో భాగంగా నాటు సారా నిర్మూలనపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు
నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన నవోదయం–2.0 కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ నాగ ప్రభు కుమార్, జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఆఫీసర్ అవులయ్య ఆదేశాల మేరకు, నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆరుగురు పాత నేరస్తులను చాట్రాయి తహసిల్దార్ (మండల కార్యనిర్వాహక మేజిస్ట్రేట్) ఎదుట హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు.
ఈ సందర్భంగా తహసిల్దార్ మాట్లాడుతూ, బైండ్ ఓవర్ కాలపరిమితి ఒక సంవత్సరం ఉంటుందని తెలిపారు. ఈ వ్యవధిలో మళ్లీ ఎక్సైజ్ నేరాలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై రూ.1 లక్ష జరిమానా విధించడంతో పాటు ప్రభుత్వ పథకాలు కూడా రద్దు చేయబడతాయని హెచ్చరించారు.
బైండ్ ఓవర్ చేసిన వ్యక్తులు:
భారోతు బిక్షం – పోతనపల్లి పెద్ద తండా
ధారావతు శ్రీను – పోతనపల్లి పెద్ద తండా
గుగులోతు వెంకటేష్ – పోతనపల్లి పెద్ద తండా
గుర్రం వెంకట మారేషు – మర్లపాలెం
ధనికొండ శ్రీను – మర్లపాలెం
కొమ్ము విజయలక్ష్మి – చీపురుగూడెం
ఇదిలా ఉండగా, నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఏ.మస్తానయ్య హెచ్చరించారు.
నాటు సారా తయారీ, విక్రయం, నిల్వ మాత్రమే కాకుండా, నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటలను కలిగి ఉన్న భూయజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.