నెంబర్ ప్లేట్ లేని 11 వాహనాలు సీజ్!
నార్కెట్పల్లి పరిధిలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు
నల్గొండ జిల్లా నార్కెట్పల్లి టౌన్ పరిధిలో పోలీసులు ఆదివారం నాడు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీలలో నెంబర్ ప్లేట్లు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న 11 వాహనాలను పోలీసులు గుర్తించారు. అనంతరం ఆ వాహనాలను పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన సదరు వాహన యజమానులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు తమ వాహనాలకు తప్పనిసరిగా చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లను ఏర్పాటు చేసుకోవాలి.అని , ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు చర్యలు తప్పవని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు కేవలం ముగిసిపోయేవి కావని, భవిష్యత్తులోనూ నిరంతరం కొనసాగుతాయని ఎస్సై విష్ణు స్పష్టం చేశారు. వాహనదారులు పోలీసులకు సహకరించి, సరైన పత్రాలతో మరియు నెంబర్ ప్లేట్లతోనే వాహనాలను నడపాలని ఆయన కోరారు.