BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

నిఖిల్ భారత్ స్కూల్‌లో హనుమాన్ మాలధారులకు అభ్యంతరం..

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Mar, 2026 - 10:57 AM
170 వీక్షణలు

 బీజేపీ నేతల నిలదీతతో దిగివచ్చిన యాజమాన్యం!

హనుమాన్ మాల ధరించిన విద్యార్థులను పాఠశాలకు రావద్దంటూ నిఖిల్ భారత్ స్కూల్ యాజమాన్యం జారీ చేసిన ఆంక్షలు తీవ్ర దుమారం రేపాయి. మాల వేసుకున్న విద్యార్థులు 21 రోజుల పాటు సెలవు తీసుకోవాలని, లేదంటే స్కూల్‌కు రావద్దని ప్రిన్సిపాల్ మరియు యాజమాన్యం హుకుం జారీ చేయడంపై హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

​అసలేం జరిగింది?

హనుమాన్ దీక్షలో ఉన్న విద్యార్థులు పాఠశాలకు రాగా, వారిని లోపలికి అనుమతించేది లేదని స్కూల్ కరస్పాండెంట్ వి.బి. మహర్షి తేల్చి చెప్పారు. గతంలోనూ ఈ పాఠశాల యాజమాన్యం హిందూ ధర్మం పట్ల ఇలాగే వ్యవహరించిందని, స్వాములను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బయటకు నెట్టేస్తామని బెదిరించడంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

​ఈ విషయం తెలుసుకున్న బీజేపీ పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్ బొడ్ల రమేష్ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు మరియు నాయకులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని నిలదీశారు. విద్యార్థులు ఏ మాల వేసుకున్నా పాఠశాలకు వచ్చే హక్కు వారికి ఉందని, ఏ చట్టం ప్రకారం అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

​డీఈఓ జోక్యంతో దిగివచ్చిన ప్రిన్సిపాల్:

యాజమాన్యం మొండిగా వ్యవహరించడంతో బీజేపీ నాయకులు తక్షణమే జిల్లా విద్యాశాఖాధికారి (DEO)తో ఫోన్లో మాట్లాడారు. డీఈఓ స్పందిస్తూ.. ఏ విద్యార్థి ఏ మాల వేసుకున్నా పాఠశాలకు రావచ్చని, అడ్డుకోవడానికి ఎటువంటి చట్టపరమైన నిబంధనలు లేవని స్పష్టం చేశారు. డీఈఓ ఆదేశాలతో వెనక్కి తగ్గిన ప్రిన్సిపాల్ వి.బి. మహర్షి, అక్కడున్న హనుమాన్ భక్తులకు, తల్లిదండ్రులకు మరియు బీజేపీ నాయకులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. అనంతరం విద్యార్థులను యథావిధిగా తరగతులకు అనుమతించారు.

​ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ధోనికెల నవీన్, బొడ్ల నాగేష్, కోయల్కర్ లింగేశ్వర్, నాయకులు బొడ్ల ఆనంద్ కుమార్, అంజయ్య, కొయ్యల లక్ష్మణ్, బొడ్ల నరేష్, కలిగోట శ్రీకాంత్, రమేష్ యాదవ్, నూనె క్రాంతి కిరణ్ మరియు పెద్ద సంఖ్యలో హనుమాన్ దీక్షాపరులు పాల్గొన్నారు.