BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు

తెలంగాణ
21 Nov, 2025 - 01:25 AM
161 వీక్షణలు
ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు NTODAY NEWS: ఏలూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ కళ్యాణ్ కుమార్ ఆదిత్య డిగ్రీ కళాశాల సత్రంపాడు ఏలూరులో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ముగిసినట్లు ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వరరావు తెలిపారు .ఈ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముందుగా డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ వంగా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 1968 నవంబర్ 14 నుంచి జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తున్నారని, ఇటువంటి వారోత్సవాల వల్ల విద్యార్థులలో పఠనా శక్తి పెంపొందడంతో పాటు, వ్యక్తి సర్వతోముఖాభివృద్ధికి గ్రంథాలయాలు పాటు పడతాయని తెలియజేశారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని, ప్రతి రోజూ న్యూస్ పేపర్ తప్పక చదవాలని, ఇంగ్లీషు భాష పై పట్టు సాధించాలని, కమ్యూనికేషన్స్ స్కిల్స్ పెంపొందించుకుని ,క్యాంపస్ ఇంటర్వ్యూలలో విజయం సాధించాలని తెలిపారు. లైబ్రేరియన్ పుప్పాల వీరభద్రరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు పఠనాశక్తిని పెంపొందిస్తాయని, గ్రంథాలయాలు సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు తమ విజ్ఞానాన్ని మరింత పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని తెలిపారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన, వకృత్వం, చిత్రలేఖనం, క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతి ప్రదానం చేశారు. విజేతలను ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఎన్ .శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ యన్. సుగుణ రెడ్డి, అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ బి.ఈ.వి. ఎల్ నాయుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డి. వి.వి. ఫణికుమార్, తెలుగు అధ్యాపకురాలు పి. సౌభాగ్య లక్ష్మి మరియు అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube