www.ntodaynews.com
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. నిర్మల్లో అరుదైన ఘటన
తెలంగాణ
/
నిర్మల్
ఒకే కాన్పులో ముగ్గురు శిశువులు.. నిర్మల్లో అరుదైన ఘటన
నిర్మల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ ఒకే డెలివరీలో ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మనిచ్చింది. వైద్యుల వివరాల ప్రకారం, దాదాపు ప్రతి 8 వేల మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలాంటి అరుదైన ప్రసవం జరిగే అవకాశం ఉంటుందని డాక్టర్ శశికాంత్ తెలిపారు.
ప్రసవ సమయంలో తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పటికీ, వైద్య బృందం అప్రమత్తంగా చికిత్స అందించి తల్లితో పాటు ముగ్గురు నవజాత శిశువులను సురక్షితంగా కాపాడినట్లు వెల్లడించారు. ఈ అరుదైన ఘటన స్థానికంగా ఆసక్తికరంగా మారింది.