BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

పాలకుర్తి నియోజకవర్గంలో వైద్య సదుపాయాల అభివృద్ధిపై చర్చ

తెలంగాణ
/ జనగామ
Reporter
బోధపల్లి వేణు పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి
18 Mar, 2026 - 08:16 AM
88 వీక్షణలు

కొడకండ్ల ఆసుపత్రిని 30 పడకలుగా అప్‌గ్రేడ్ చేయాలని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విజ్ఞప్తి

పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి హైదరాబాద్‌లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహను ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఆరోగ్య సదుపాయాల మెరుగుదల కోసం తీసుకోవాల్సిన చర్యలను ఎమ్మెల్యే వివరించారు. ముఖ్యంగా కొడకండ్ల మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రస్తుతం కేవలం 7 పడకలతో మాత్రమే సేవలందిస్తోందని, పెరుగుతున్న జనాభా మరియు రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దాన్ని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఈ మార్పు వల్ల స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఎమ్మెల్యే విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ సంబంధిత అధికారులతో చర్చించి ఆసుపత్రి అప్‌గ్రేడేషన్‌కు అవసరమైన చర్యలు తీసుకుంటామని, మంజూరుకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మంత్రి దామోదర్ రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.