www.ntodaynews.com
పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి
తెలంగాణ
/
మంచిర్యాల
/
మందమర్రి
పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి: కలెక్టర్కు వినతి
మందమర్రి: పట్టణంలోని సింగరేణి పాఠశాల మైదానంలో నిర్మిస్తున్న ప్రైవేట్ సెల్ టవర్ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని కోరుతూ వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు దుర్గం ప్రభాకర్ సోమవారం 'ప్రజావాణి'లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో టవర్ ఏర్పాటు చేయడం వల్ల వెలువడే రేడియేషన్ ప్రభావం విద్యార్థులపై పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వెంటనే నిర్మాణ పనులను అడ్డుకోవాలని ఆయన అధికారులను కోరారు