BREAKING
​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద ​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన మహానాడు రెండో రోజు కార్యక్రమానికి చనుబండ నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటి వీరేష్. స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ​ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగంగా నిర్వహించాలి వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఏఈవో బలవన్మరణం ​టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్దన్ ​మంచిర్యాలలో బక్రీద్ వేడుకలు: మేయర్, కార్పొరేటర్ల శుభాకాంక్షలు ​ఆఖరి గింజ వరకు వరి ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి గడ్డం వివేకానంద ​ఐకేపీ, వీఓఏల సమ్మెకు మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సంపూర్ణ మద్దతు పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన మహానాడు రెండో రోజు కార్యక్రమానికి చనుబండ నుంచి భారీగా తరలిన టీడీపీ శ్రేణులు ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటి వీరేష్. స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి
www.ntodaynews.com

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వామపక్షాల ఆందోళన

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 May, 2026 - 05:32 PM
11 వీక్షణలు

జూన్ 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం – జూన్ 9న రాస్తారోకోలు

సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సిపిఐ(ఎం.ఎల్) రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షత వహించారు.

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటివరకు నాలుగు సార్లు పెంచడాన్ని సమావేశం తీవ్రంగా ఖండించింది. మరోసారి ధరలు పెంచబోతున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళన వ్యక్తం చేసింది.

ధరల పెరుగుదలను నిరసిస్తూ జూన్ 1 నుంచి 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ప్రచారం, కరపత్రాల పంపిణీ, సమావేశాలు, సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. అనంతరం జూన్ 9న రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టి నిరసన తెలియజేయనున్నారు.

కేజీ బేసిన్ గ్యాస్ సాధన కోసం పాసర్లపూడి ప్రాంతాన్ని వామపక్షాల బృందం జూన్ మొదటి వారంలో పర్యటించనుంది.

ప్రధాన డిమాండ్లు

పెట్రోలు, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు తగ్గించాలి.

కేజీ బేసిన్ నుంచి ఉత్పత్తి అయ్యే చమురు, గ్యాస్‌లో 50 శాతం రాష్ట్రానికి కేటాయించాలి.

రష్యా, ఇరాన్ దేశాల నుంచి ఆయిల్, గ్యాస్ కొనుగోళ్లు కొనసాగించాలి.

కమర్షియల్ గ్యాస్‌ను పాత ధరలకే అందించాలి.

ఈ సమావేశంలో వి. శ్రీనివాసరావు, వై. వెంకటేశ్వరరావు (సిపిఎం), హరినాథ్ రెడ్డి (సిపిఐ), చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పొలారి (సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ), హరినాథ్ (సిపిఎంఎల్ లిబరేషన్), గణేష్ బాబు ఎంసిపిఐ(యు) పాల్గొన్నారు.

ఆర్‌ఎస్‌పి, ఫార్వర్డ్ బ్లాక్, న్యూ డెమోక్రసీ, ఎస్‌యుసిఐ(సి) పార్టీలు సమావేశ నిర్ణయాలకు పూర్తి మద్దతు ప్రకటించాయి.