పంతంగి టోల్ గేట్ వద్ద ఎండు గంజాయి పట్టివేత
పంతంగి టోల్ గేట్ వద్ద ఆటోలో తరలిస్తున్న 60.685 కేజీల ఎండు గంజాయి పట్టివేత
17వ తేదీ మంగళవారం రోజున డైరెక్టర్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్,ఉమ్మడి నల్గొండ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎ.శ్రీనివాస్ రెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా డిస్ట్రిక్ట్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎం.విష్ణు మూర్తి ఆదేశాల మేరకు ఆర్. బాళోజి నాయక్ SHO.రామన్నపేట మరియు కె. రవిచంద్ర రెడ్డి SHO మోత్కూర్ ఆధ్వర్యంలో పంతంగి టోల్ గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వస్తున్న ఒక ఆటో ను ఆపి తనిఖీ చేయగా దానిలో 60.685kg ల ఎండు గంజాయి లభ్యమైంది.అని అధికారులు తెలిపారు ఇట్టి గంజాయిని A1) గంగా బాయ్ పాండు రంగ్ చౌహన్ R/o. మహారాష్ట్ర A2) కమల్ అర్జున్ మోహితే R/o. మహారాష్ట్ర A3) విజయ్ ఆసరం గోరపడేR/o. మహారాష్ట్రA4) వల్లపు దాసు వేణు కుమార్ R/o. నల్గొండ అను వ్యక్తులు ఒడిశా రాష్టంలోని భరంపూర్ నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకి తరలిస్తూ పట్టుబడినారు అని అధికారులు తెలిపారు తదుపరి విచారణ నిమిత్తం ఇట్టి గంజాయిని,1 ఆటో , 2సెల్ ఫోన్ ,ముద్దాయిలను మరియు ముద్దాయి వద్ద గంజాయి ( వీటి మొత్తం విలువ సుమారు రూ.33లక్షలు) రామన్నపేట ఎక్సైజ్ స్టేషన్ కి తరలించడం జరిగింది అని అన్నారు ఈ తనిఖీలలో ఎస్ఐ లు ఎన్.శంకర్,బి.శివ కృష్ణ, పి. సత్యనారాయణ కానిస్టేబుల్స్ తిరుమలేష్, రావొజీ,రహమాన్,రమేష్ రెడ్డి, కృష్ణ రెడ్డి,గోపి, అనిల్,వెంకట్,సోనీ,స్వప్న పాల్గొన్నారు.