www.ntodaynews.com
ప్రధాని మోదీకి జగన్ అభినందనలు
జాతీయం
ప్రధాని మోదీకి జగన్ అభినందనలు
ఆంధ్రప్రదేశ్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధినేతగా 8,931 రోజులు పూర్తి చేసుకుని చారిత్రక మైలురాయిని చేరుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు.
ఎక్స్ వేదికగా ప్రధాని మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఇది మోదీ పట్టుదలకు, అంకితభావానికి నిదర్శనమని పేర్కొన్నారు. దేశ సేవలో ఆయనకు మరింత శక్తి, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని ఆకాంక్షించారు.
ఇదే సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు.