BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి

తెలంగాణ
/ నిజామాబాద్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
20 Mar, 2026 - 06:31 PM
142 వీక్షణలు

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి: మోపాల్ పోలీస్ స్టేషన్ తనిఖీలో సీపీ పి. సాయి చైతన్య ఐపీఎస్

నిజామాబాద్: జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐ.పి.ఎస్ గారు శుక్రవారం మోపాల్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.

​ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డుల నిర్వహణ, ఫిర్యాదుల పరిష్కార తీరు, భద్రతా చర్యలు మరియు సిబ్బంది పనితీరును సీపీ సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పోలీస్ సిబ్బంది ప్రజలతో మరింత స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.

​అనంతరం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన బొలెరో వాహనం, పెట్రోలింగ్ వాహనాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. వాహనాల్లో ఉండే ఫస్ట్ ఎయిడ్ కిట్ సామాగ్రిని తనిఖీ చేసిన ఆయన, వాహనాలను ఎల్లప్పుడూ మంచి కండిషన్‌లో ఉంచుకోవాలని సిబ్బందికి తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని సీపీ పేర్కొన్నారు.

​ఈ తనిఖీలో నిజామాబాద్ సౌత్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సురేష్ కుమార్, ఎస్సై జెడ్. సుస్మిత మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.