ప్రపంచ సంక్షోభంలో భారత్ ధైర్యంగా నిలుస్తుంది
ప్రపంచ సంక్షోభంలో భారత్ ధైర్యంగా నిలుస్తుంది: మోదీ
Mar 29, 2026
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా భారత్ ఏమాత్రం వెనుకడుగు వేయదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, ఇంధన సంక్షోభం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనే శక్తి భారత్కు ఉందన్నారు.
ఆదివారం జరిగిన 132వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న కోట్లాది భారతీయుల భద్రతపై ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు.
స్వార్థ రాజకీయాల కోసం వదంతులు సృష్టించవద్దని హెచ్చరించిన మోదీ, ప్రజలు అధికారిక సమాచారాన్నే నమ్మాలని విజ్ఞప్తి చేశారు.
ఇంధన భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని, దేశవ్యాప్తంగా పైప్డ్ నేచురల్ గ్యాస్ మౌలిక వసతులను వేగంగా విస్తరిస్తున్నామని వెల్లడించారు.