BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

శ్రీశైలంలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు

తెలంగాణ
14 Feb, 2026 - 03:50 AM
295 వీక్షణలు
  శ్రీశైలంలో ప్రశాంతంగా మహాశివరాత్రి దర్శనాలు – ఎస్పీ సునీల్ షొరాణ్ NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట భద్రతా మరియు సౌకర్యాల ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు. స్వామి, అమ్మవార్ల దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. దేవస్థాన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. నిన్న ఒక్కరోజే సుమారు 84,000 మంది భక్తులు దర్శనం చేసుకోగా, వీరిలో 32,543 మంది శివస్వాములు ఉన్నారని వెల్లడించారు. భారీ రద్దీ ఉన్నప్పటికీ ఎలాంటి అంతరాయం లేకుండా దర్శనం కల్పించినట్లు చెప్పారు. అటవీ మార్గం (కైలాస మార్గం) ద్వారా వేలాదిగా పాదయాత్రికులు తరలివస్తున్నారని, వారికి తాగునీరు, భోజన వసతులు, తాత్కాలిక విశ్రాంతి కేంద్రాలు, వైద్య శిబిరాలు, పార్కింగ్ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. మహాశివరాత్రి రోజున జరిగే పాగాలంకరణ కార్యక్రమం నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్ర పరిసరాలను నిరంతరం పర్యవేక్షిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా విధులు నిర్వర్తిస్తున్నారని ఎస్పీ వివరించారు. -జిల్లా పోలీస్ కార్యాలయం, నంద్యాల #Srisailam #Mahashivaratri2026 #NandyalPolice #TempleSecurity #DevoteesSafety #CrowdManagement #AndhraPradesh #SpiritualNews Follow us on Website Facebook Instagram YouTube