BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

తెలంగాణ
04 Jan, 2026 - 09:29 AM
233 వీక్షణలు

రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం

-రాయికల్ పట్టణంలో బీఆర్‌ఎస్ నేతల పాల్గొనడం NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ రాయికల్ పట్టణంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొన్నారు. పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ— గ్రామ పంచాయతీగా ఉన్న రాయికల్‌ను మున్సిపాలిటీగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో మంజూరైన రూ.25 కోట్ల నిధులతోనే ఇప్పటివరకు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైనా ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా కొనసాగాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, అమలు చేయని హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేసి రాయికల్ పట్టణంలోని 12 వార్డుల్లో బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఎలిగేటి అనిల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మరంపెల్లి రాణి, సాయి కుమార్, ఉదయశ్రీ లింగన్న, మాజీ కౌన్సిలర్లు తురగ శ్రీధర్ రెడ్డి, సాయి కుమార్, సువర్ణ శ్రీరాములు, సత్యనారాయణ, మహేష్ గౌడ్, మాజీ కో-ఆప్షన్ సభ్యులు వనిత, గణేష్, సోహెల్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube