BREAKING
ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి ఎండియు ఆపరేటర్లు వెన్నుపోటుకి ఏడాది రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన డిసిపి గుణ్ణం రామకృష్ణ.. పోగొట్టుకున్న 15 మొబైల్ ఫోన్ల రికవరీ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ ను విజయవంతంగా నిర్వహిస్తున్నాం- ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి .లక్ష్మిశ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! డ్వాక్రా నిధుల దుర్వినియోగం కేసులో DRDA APM, సీసీకి రిమాండ్ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి
www.ntodaynews.com

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

తెలంగాణ
02 Jun, 2025 - 07:47 AM
240 వీక్షణలు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని శాసన పరిషత్ చైర్మన్ కు వినతి NTODAY NEWS: యాదాద్రి భువనగిరి జిల్లా, జూన్ 2 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరులైన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని "తెలంగాణ అమర వీరుల కుటుంబాల కమిటీ " యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ బర్రె సుదర్శన్, కో- కన్వీనర్ కొడారి వెంకటేష్ లు కోరారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి వారు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన హామీలైన ప్రతి అమరవీరుల కుటుంబానికి 25 వేల రూపాయల పెన్షన్, 250 గజాల ఇంటి స్థలాలు ఇవ్వాలని వారు కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరియు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లతో అమరవీరుల కుటుంబాల సభ్యులు కలిసి మాట్లాడే అవకాశం కల్పించాలని వారు తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ని కోరారు. రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ సానుకూలంగా స్పందించి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెల్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.వినతి పత్రం ఇచ్చిన వారిలో అమరవీరుల కుటుంబాల సభ్యులు కోట్యా నాయక్,జ్యోత్స్న ,రవి,లలిత, శిరీష,స్వాతి,వాసవి,కృష్ణవేణి, తదితరులు ఉన్నారు. Follow us on Website Facebook Instagram YouTube