www.ntodaynews.com
ఈ నెల 16న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
తెలంగాణ
ఈ నెల 16న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహణ
NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున
నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ నెల 16 (సోమవారం)న ప్రత్యేక వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా తెలిపారు.
నంద్యాల జిల్లా కలెక్టరేట్తో పాటు అన్ని మండల, డివిజన్ కేంద్రాలు మరియు మున్సిపల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రజలు తమ అర్జీలను సంబంధిత కార్యాలయాల్లో ప్రత్యక్షంగా సమర్పించవచ్చని పేర్కొన్నారు.
అలాగే అర్జీలను ఆన్లైన్లో meekosam.ap.gov.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. అర్జీ పరిష్కార స్థితి వివరాలను అదే వెబ్సైట్లో లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1100 ద్వారా తెలుసుకోవచ్చని వెల్లడించారు.
అర్జీదారులు ముందుగా తమ మండల, డివిజన్ లేదా మున్సిపల్ కార్యాలయాల్లో సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించాలని, అక్కడ పరిష్కారం కాని అంశాలకే జిల్లా కేంద్ర వేదికకు హాజరుకావాలని సూచించారు.
జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు.
#PublicGrievance #MeeKosam #NandyalDistrict #APGovernment #CitizenServices
Follow us on
Website
Facebook
Instagram
YouTube