BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

రాష్ట్రంలో భారీ భూస్కాం ఆరోపణలు

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 03:11 PM
69 వీక్షణలు

రాష్ట్రంలో భారీ భూస్కాం ఆరోపణలు – అసెంబ్లీలో దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు 

హైదరాబాద్: రాష్ట్రంలో గత పదేళ్లుగా వేల ఎకరాల భూములపై భారీ స్థాయిలో స్కాములు జరిగాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు.

తన సొంత భూమిని మాజీ మంత్రి కేటీఆర్ ఓ కంపెనీకి అప్పగించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అవసరమైతే వాటిని సభ ముందు ఉంచేందుకు సిద్ధమని తెలిపారు.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన తనను, తన కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉండేలా ఒత్తిడి తీసుకువచ్చారని, దీనివల్ల తమకు భారీ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక హౌస్‌లో అప్పటి ప్రభుత్వం గీసిన “లక్ష్మణ రేఖ”ను ఇప్పుడు మాజీ మంత్రే దాటారని విమర్శించారు. సభ్యుల డిమాండ్‌ను గౌరవిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ స్కాములపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

 ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.