రాష్ట్రంలో భారీ భూస్కాం ఆరోపణలు
రాష్ట్రంలో భారీ భూస్కాం ఆరోపణలు – అసెంబ్లీలో దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: రాష్ట్రంలో గత పదేళ్లుగా వేల ఎకరాల భూములపై భారీ స్థాయిలో స్కాములు జరిగాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీలో సంచలన ఆరోపణలు చేశారు.
తన సొంత భూమిని మాజీ మంత్రి కేటీఆర్ ఓ కంపెనీకి అప్పగించారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు. అవసరమైతే వాటిని సభ ముందు ఉంచేందుకు సిద్ధమని తెలిపారు.
హైదరాబాద్లో పుట్టి పెరిగిన తనను, తన కుటుంబాన్ని బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉండేలా ఒత్తిడి తీసుకువచ్చారని, దీనివల్ల తమకు భారీ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక హౌస్లో అప్పటి ప్రభుత్వం గీసిన “లక్ష్మణ రేఖ”ను ఇప్పుడు మాజీ మంత్రే దాటారని విమర్శించారు. సభ్యుల డిమాండ్ను గౌరవిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన భూ స్కాములపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.