www.ntodaynews.com
రేపటి నుంచి శుభకార్యాలకు బ్రేక్.. 36 రోజుల పాటు ముహూర్తాలకు విరామం
జాతీయం
రేపటి నుంచి శుభకార్యాలకు తాత్కాలికంగా బ్రేక్ పడనుంది. అధిక జ్యేష్ఠ మాసం(మూఢమి) ప్రారంభం కావడంతో ఈ నెల 18 నుంచి వచ్చే నెల జూన్ 18 వరకు వివాహాలు సహా శుభకార్యాలు నిర్వహించరు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి కార్యక్రమాలు నిలిచిపోనున్నాయి.
ఈ నేపథ్యంలో ఈ నెలలో చివరి శుభ ముహూర్తమైన 13వ తేదీన పెద్ద ఎత్తున వివాహాలు జరుగుతున్నాయి. ఫంక్షన్ హాళ్లు, దేవాలయాలు, క్యాటరింగ్ కేంద్రాలు సందడిగా మారాయి. బంధుమిత్రులతో కళకళలాడుతున్న పెళ్లి వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
మళ్లీ జూన్ 19 నుంచి వివాహాది శుభకార్యాలు ప్రారంభం కానున్నాయి.