BREAKING
తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంపుదలపై ప్రత్యేక దృష్టి ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే! రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం స్టేషన్‌కే ఆలయ కళ… చిన్న తిరుపతిని తలపిస్తున్న ఏలూరు రైల్వే జంక్షన్ చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్ తమిళనాడులో మంత్రులకు శాఖల కేటాయింపు తమిళనాడు సీఎం విజయ్‌తో కమల్ హాసన్ భేటీ.. అభివృద్ధి పై చర్చ గుండ్రాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం : ఆగి ఉన్న డీసీఎంను ఢీకొట్టిన లారీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా అవగాహన పెంపుదలపై ప్రత్యేక దృష్టి ప్రైవేట్ ఆసుపత్రి బిల్లు కట్టలేదని డెడ్ బాడీని ఆపినా.. డిశ్చార్జ్ నిరాకరించినా.. అది నేరమే! రైతుల పంటలకు మద్దతు ధరల పెంపు మోసపూరితం స్టేషన్‌కే ఆలయ కళ… చిన్న తిరుపతిని తలపిస్తున్న ఏలూరు రైల్వే జంక్షన్ చనుబండలో గృహ నిర్మాణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన చనుబండ పిఏసియస్ సభ్యుడి కుటుంబానికి ఆర్థిక సాయం రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్
www.ntodaynews.com

రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 04:29 PM
22 వీక్షణలు

రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్ చాట్రాయిలో రైతులకు అవగాహన కార్యక్రమం

చాట్రాయి, 16-05-2026:

వ్యవసాయ శాఖ రూపొందించిన APAIMS ఫార్మర్ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరమని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు వరి సాగులో వివిధ యాజమాన్య పద్ధతులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లభ్యత, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెటింగ్ అంశాలు, వాతావరణ హెచ్చరికలు, పంటలపై చీడపీడలను గుర్తించే విధానం, నీటి లభ్యత వంటి కీలక సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

పంట సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. రైతు సేవ కేంద్రాల్లోని VAA, VHAలను సంప్రదిస్తే యాప్ వినియోగంపై పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి రైతు APAIMS యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు.

ఇదే సందర్భంగా చాట్రాయి మండల రైతులకు అవసరమైన జీలుగా, జనుము, పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను రైతు సేవ కేంద్రాలకు అందజేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న పచ్చిరొట్ట ఎరువులను రైతులు 50 శాతం రాయితీపై పొందాలని కోరారు.

చాట్రాయి గ్రామంలో రైతులకు APAIMS ఫార్మర్ యాప్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.