BREAKING
వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.. వర్షాకాలంలో డ్రైన్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలి విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎంపీ కేశినేని చిన్ని Vijayawada: ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఏరువాక పౌర్ణమి వేడుకలు.. రైతు మహిళలకు పవిత్ర వడ్ల పంపిణీ Nandyal: నేషనల్ హైవే 167K పనులు వేగవంతం.. గాలేరు నదిపై కొత్త వంతెన నిర్మాణం Hyderabad: వీ వైశ్య గ్లోబల్ కాంక్లేవ్–2026 విజయవంతం.. Pulse Polio: పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.. చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు Pulse Polio: విజయవాడలో పల్స్ పోలియో కార్యక్రమానికి శ్రీకారం.. ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: కమిషనర్ ధ్యానచంద్ర RTC: విజయవాడ, గుంటూరు బస్సుల కొరతతో ప్రయాణికుల అవస్థలు TDP: ప్రజలతో మమేకమయ్యేందుకు 'సర్' గొప్ప అవకాశం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు Health: పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి..
www.ntodaynews.com

రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 04:29 PM
142 వీక్షణలు

రైతులకు ఉపయోగకరంగా APAIMS ఫార్మర్ యాప్ చాట్రాయిలో రైతులకు అవగాహన కార్యక్రమం

చాట్రాయి, 16-05-2026:

వ్యవసాయ శాఖ రూపొందించిన APAIMS ఫార్మర్ యాప్ రైతులకు ఎంతో ఉపయోగకరమని చాట్రాయి మండల వ్యవసాయ అధికారి బి. శివశంకర్ తెలిపారు. ఈ యాప్ ద్వారా రైతులు వరి సాగులో వివిధ యాజమాన్య పద్ధతులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల లభ్యత, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెటింగ్ అంశాలు, వాతావరణ హెచ్చరికలు, పంటలపై చీడపీడలను గుర్తించే విధానం, నీటి లభ్యత వంటి కీలక సమాచారాన్ని తెలుసుకోవచ్చన్నారు.

పంట సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ యాప్ ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు. రైతు సేవ కేంద్రాల్లోని VAA, VHAలను సంప్రదిస్తే యాప్ వినియోగంపై పూర్తి అవగాహన కల్పిస్తామని తెలిపారు. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి రైతు APAIMS యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని వినియోగించుకోవాలని సూచించారు.

ఇదే సందర్భంగా చాట్రాయి మండల రైతులకు అవసరమైన జీలుగా, జనుము, పిల్లి పెసర పచ్చిరొట్ట విత్తనాలను రైతు సేవ కేంద్రాలకు అందజేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న పచ్చిరొట్ట ఎరువులను రైతులు 50 శాతం రాయితీపై పొందాలని కోరారు.

చాట్రాయి గ్రామంలో రైతులకు APAIMS ఫార్మర్ యాప్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.