BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

రిజర్వేషన్లపై జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక సిద్ధం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 07:42 PM
86 వీక్షణలు

న్యూఢిల్లీ, జూన్ 12: మతం మారిన దళితుల రిజర్వేషన్ల అమలుపై కేంద్రం ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలో దళిత క్రైస్తవ, ముస్లింలకు ఎస్సీ హోదా కల్పన, అలాగే మతం మారిన తర్వాత కూడా ఎస్సీ హోదా ఇవ్వాలా అనే అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసినది. త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదిక అందజేయనున్నారు.

కమిషన్ నాలుగేళ్ల పాటు వివిధ రంగాలలో సుదీర్ఘ పరిశీలనచేసింది. ప్రజల్లోని అనుభవాలను, సామాజిక వివక్షను పరిశీలించి నివేదికలో ప్రస్తావన చేశారు. జూన్ 10తో కమిషన్ గడువు ముగిసింది, కానీ కేంద్రం మరో 10 రోజులపాటు పొడిగించింది.

1950లో ఆమోదించబడిన రాజ్యాంగం ప్రకారం, హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లోని దళితులకు మాత్రమే ఎస్సీ హోదా ఉంది. దీన్నప్పటికీ ముస్లిం, క్రైస్తవ మతాల్లోని దళితులకు కూడా ఎస్సీ హోదా ఇవ్వాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

ఇస్లాం, క్రైస్తవ మతాల్లో కుల వ్యవస్థ లేదని కేంద్రం ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చింది. అయితే, ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, ఈ మతాల్లో చేరిన దళితులకు రిజర్వేషన్లు వర్తించవు. ఈ నేపథ్యంలో జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ సిఫార్సులు దేశవ్యాప్తంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ఉత్కంఠకు కారణమయ్యాయి.