www.ntodaynews.com
రూ.11.82 కోట్ల విలువైన డ్రగ్స్ కేసులో మోడల్ అరెస్ట్.. బ్యాంకాక్ నుంచి ముంబైకి రాగానే పట్టివేత
జాతీయం
ముంబై ఎయిర్పోర్టులో భారీ డ్రగ్స్ రవాణా కేసు వెలుగులోకి వచ్చింది. మిస్ కేరళ-2025 రన్నరప్, మోడల్ హర్షా సన్నీ ను కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
బ్యాంకాక్ నుంచి ముంబై ఎయిర్పోర్టుకు నిన్న రాత్రి చేరుకున్న ఆమె కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఆమె ట్రాలీ బ్యాగులో వ్యాక్యూమ్ సీల్ చేసి దాచిన 11 కిలోల డ్రగ్స్ గుర్తించారు.
వాటి మార్కెట్ విలువ సుమారు రూ.11.82 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. దీంతో వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించినట్లు అధికారులు వెల్లడించారు.