www.ntodaynews.com
రోడ్డు ప్రమాదంలో ప్రభుత్వ ఉద్యోగి శైలజ దుర్మరణం
తెలంగాణ
/
మంచిర్యాల
/
లక్సెట్టిపేట
మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం గుల్లకోట వద్ద జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదంలో ఎంపీడీవో కార్యాలయ ఈసీ శైలజ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. శుక్రవారం రాత్రి లక్సెట్టిపేటలో నిర్వహించిన ఎంపీడీవో రిటైర్మెంట్ వేడుకలకు ఆమె తన భర్తతో కలిసి హాజరై, వేడుక ముగిసిన అనంతరం తిరిగి బైక్పై మంచిర్యాలకు బయలుదేరారు. మార్గమధ్యంలో గుల్లకోట వద్దకు రాగానే ఒక్కసారిగా ఒక పంది బైక్కు అడ్డం రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద తీవ్రతకు శైలజ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన ఆమె భర్తను స్థానికులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు