BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

సైబర్ మోసాలకు గురై డబ్బులు పోగొట్టుకున్నారా..? 2027 నుంచి కొత్త నిబంధనలు..!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 08:16 AM
41 వీక్షణలు

 సైబర్ మోసాల బాధితులకు ఊరటనిచ్చేలా ఆర్బీఐ కొత్త పరిహార విధానాన్ని తీసుకురానుంది. 2027 జనవరి 1 నుంచి అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, డిజిటల్ మోసాల్లో రూ.50 వేల లోపు నష్టం జరిగిన వారికి గరిష్ఠంగా రూ.25 వేల వరకు లేదా నష్టపోయిన మొత్తంలో 85 శాతం వరకు పరిహారం అందించే అవకాశం ఉంది.

అయితే ఈ సౌకర్యం పొందాలంటే బాధితులు మోసం జరిగిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వడంతో పాటు 1930 హెల్ప్‌లైన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన తర్వాత అర్హులైన వారికి పరిహారం అందజేయనున్నారు.

ఇక కస్టమర్ ఎలాంటి ఓటీపీ, పాస్‌వర్డ్ లేదా వ్యక్తిగత వివరాలు పంచుకోకుండానే ఖాతా నుంచి డబ్బులు మాయమైతే, ఆ నష్టానికి బ్యాంకే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

అయితే లక్షల్లో డబ్బులు కోల్పోయిన బాధితులకు ఎలాంటి పరిహారం అందిస్తారనే విషయంపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. దీనిపై ఆర్బీఐ నుంచి మరిన్ని మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉంది.

 గుర్తుంచుకోండి: సైబర్ మోసం జరిగిన వెంటనే 1930కు కాల్ చేయడం, వెంటనే ఫిర్యాదు నమోదు చేయడం ద్వారా డబ్బులు తిరిగి పొందే అవకాశాలు పెరుగుతాయి.