BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

సింగరేణి కార్మిక వర్గాల్లో తీవ్ర ఆవేదన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
28 May, 2026 - 11:46 AM
27 వీక్షణలు

సింగరేణి కార్మికుల్లో తీవ్ర ఆవేదన


ఎనిమిది నెలలైనా విడుదల కాని ప్రమోషన్ ఆర్డర్లు

సింగరేణి కాలరీస్‌ సంస్థ పరిధిలో ప్రమోషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ, అర్హులైన కార్మికులకు ఇప్పటికీ ప్రమోషన్ ఆర్డర్లు జారీ చేయకపోవడం కార్మిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. సీనియారిటీ జాబితాలు ఖరారు చేయకపోవడం, గనుల కేటాయింపులు చేపట్టకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిరంతరం వాయిదా పడుతుండటంతో యాజమాన్య తీరుపై కార్మికుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ తమ భవిష్యత్తు ఇంకా అనిశ్చితిలోనే ఉందని పలువురు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగ పరమైన పురోగతితో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడుతోందని వారు పేర్కొంటున్నారు. కొంతమంది కార్మికులు కొత్త గనుల కేటాయింపులపై స్పష్టత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి, కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న కార్మికులను తిరిగి పాత గనులకే పంపించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ ఆర్డర్లను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రమోషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశముందని కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.