BREAKING
ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం కొమ్మినేని సూపర్ స్పెషలిటీ హాస్పటల్ సౌజన్యంతో నియోజకవర్గం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు ఘనంగా టిడిపి మహానాడు పసుపు జాతర–2026 ఏపీలో బగ్గుమంటున్న ఎండలు ముస్లిం సోదరులకు జనసేన నాయకులు పెంటేల బాలాజీ బక్రీద్ శుభాకాంక్షలు మదనపల్లె లో ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైటాయించి ఆందోళన చేసిన బాధితులు... చిలకలూరిపేట వైభవంగా బక్రీద్ వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఇండో – కివీస్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎవరికి ప్రయోజనకరం? అమరావతి నిర్మాణ సమీక్షలో కానరాని కార్మిక సమస్యలు ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం కొమ్మినేని సూపర్ స్పెషలిటీ హాస్పటల్ సౌజన్యంతో నియోజకవర్గం ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు ఘనంగా టిడిపి మహానాడు పసుపు జాతర–2026 ఏపీలో బగ్గుమంటున్న ఎండలు ముస్లిం సోదరులకు జనసేన నాయకులు పెంటేల బాలాజీ బక్రీద్ శుభాకాంక్షలు మదనపల్లె లో ఆసుపత్రి వద్ద రోడ్డుపై బైటాయించి ఆందోళన చేసిన బాధితులు... చిలకలూరిపేట వైభవంగా బక్రీద్ వేడుకలు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.. ఇండో – కివీస్‌ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎవరికి ప్రయోజనకరం? అమరావతి నిర్మాణ సమీక్షలో కానరాని కార్మిక సమస్యలు
www.ntodaynews.com

సింగరేణి కార్మిక వర్గాల్లో తీవ్ర ఆవేదన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రతినిధి
28 May, 2026 - 11:46 AM
15 వీక్షణలు

సింగరేణి కార్మికుల్లో తీవ్ర ఆవేదన


ఎనిమిది నెలలైనా విడుదల కాని ప్రమోషన్ ఆర్డర్లు

సింగరేణి కాలరీస్‌ సంస్థ పరిధిలో ప్రమోషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ, అర్హులైన కార్మికులకు ఇప్పటికీ ప్రమోషన్ ఆర్డర్లు జారీ చేయకపోవడం కార్మిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. సీనియారిటీ జాబితాలు ఖరారు చేయకపోవడం, గనుల కేటాయింపులు చేపట్టకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిరంతరం వాయిదా పడుతుండటంతో యాజమాన్య తీరుపై కార్మికుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ తమ భవిష్యత్తు ఇంకా అనిశ్చితిలోనే ఉందని పలువురు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగ పరమైన పురోగతితో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడుతోందని వారు పేర్కొంటున్నారు. కొంతమంది కార్మికులు కొత్త గనుల కేటాయింపులపై స్పష్టత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి, కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న కార్మికులను తిరిగి పాత గనులకే పంపించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ ఆర్డర్లను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రమోషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశముందని కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.