BREAKING
తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు బీరంగుడా నుంచి క్రిష్టారెడ్డి పేట వరకు స్ట్రీట్ లైట్స్ మరమ్మతులు పూర్తి హరీశ్‌రావు అరెస్ట్‌పై ఆందోళన
www.ntodaynews.com

సింగరేణి కార్మిక వర్గాల్లో తీవ్ర ఆవేదన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 May, 2026 - 11:46 AM
103 వీక్షణలు

సింగరేణి కార్మికుల్లో తీవ్ర ఆవేదన


ఎనిమిది నెలలైనా విడుదల కాని ప్రమోషన్ ఆర్డర్లు

సింగరేణి కాలరీస్‌ సంస్థ పరిధిలో ప్రమోషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ, అర్హులైన కార్మికులకు ఇప్పటికీ ప్రమోషన్ ఆర్డర్లు జారీ చేయకపోవడం కార్మిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. సీనియారిటీ జాబితాలు ఖరారు చేయకపోవడం, గనుల కేటాయింపులు చేపట్టకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిరంతరం వాయిదా పడుతుండటంతో యాజమాన్య తీరుపై కార్మికుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ తమ భవిష్యత్తు ఇంకా అనిశ్చితిలోనే ఉందని పలువురు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగ పరమైన పురోగతితో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడుతోందని వారు పేర్కొంటున్నారు. కొంతమంది కార్మికులు కొత్త గనుల కేటాయింపులపై స్పష్టత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి, కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న కార్మికులను తిరిగి పాత గనులకే పంపించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ ఆర్డర్లను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రమోషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశముందని కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.