BREAKING
రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం
www.ntodaynews.com

సింగరేణి కార్మిక వర్గాల్లో తీవ్ర ఆవేదన

తెలంగాణ
/ మంచిర్యాల / మంచిర్యాల
Reporter
V శ్రీనివాస్ మంచిర్యాల నియోజవర్గ ప్రతినిధి
28 May, 2026 - 11:46 AM
65 వీక్షణలు

సింగరేణి కార్మికుల్లో తీవ్ర ఆవేదన


ఎనిమిది నెలలైనా విడుదల కాని ప్రమోషన్ ఆర్డర్లు

సింగరేణి కాలరీస్‌ సంస్థ పరిధిలో ప్రమోషన్ కౌన్సిలింగ్ ప్రక్రియ పూర్తయి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ, అర్హులైన కార్మికులకు ఇప్పటికీ ప్రమోషన్ ఆర్డర్లు జారీ చేయకపోవడం కార్మిక వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తోంది. సీనియారిటీ జాబితాలు ఖరారు చేయకపోవడం, గనుల కేటాయింపులు చేపట్టకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రత్యేకంగా గత మూడు నెలలుగా ఈ ప్రక్రియ నిరంతరం వాయిదా పడుతుండటంతో యాజమాన్య తీరుపై కార్మికుల్లో ఆగ్రహం మరింత పెరిగింది. కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ తమ భవిష్యత్తు ఇంకా అనిశ్చితిలోనే ఉందని పలువురు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రమోషన్ ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగ పరమైన పురోగతితో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం పడుతోందని వారు పేర్కొంటున్నారు. కొంతమంది కార్మికులు కొత్త గనుల కేటాయింపులపై స్పష్టత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి, కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్న కార్మికులను తిరిగి పాత గనులకే పంపించాలని, పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్ ఆర్డర్లను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

కార్మికుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రమోషన్ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని వారు కోరుతున్నారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టే అవకాశముందని కార్మిక వర్గాలు హెచ్చరిస్తున్నాయి.