BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

సమ్మెలో సిబ్బంది.. రంగంలోకి సర్పంచ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
17 Mar, 2026 - 04:42 AM
272 వీక్షణలు

గ్రామంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూసేందుకు నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో నీ బోయగుబ్బ గ్రామ సర్పంచ్ రేగులగడ్డ స్వామి గౌడ్ అరుదైన రీతిలో స్పందించారు. గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెలో ఉన్నప్పటికీ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన స్వయంగా ట్రాక్టర్ నడిపి వీధి వీధికి వెళ్లి చెత్తను సేకరించారు. ఐదు నెలలుగా అందని జీతాలు

​గత ఐదు నెలలుగా గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు చెల్లించకపోవడంతో వారు విధులకు హాజరు కావడం లేదు. చివరికి పంచాయతీ ట్రాక్టర్ డ్రైవర్ కూడా జీతం రాక పని మానేయడంతో గ్రామంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయింది. పారిశుద్ధ్యం క్షీణించి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని గమనించిన సర్పంచ్, అధికారుల కోసం వేచి చూడకుండా స్వయంగా రంగంలోకి దిగారు. పదవిలో ఉన్నామన్న అహంకారం లేకుండా గ్రామం కోసం సర్పంచ్ పడుతున్న శ్రమ ఆదర్శప్రాయం" అని స్థానికులు కొనియాడారు.​సర్పంచ్ చొరవను అభినందిస్తూనే, మరోవైపు పంచాయతీ సిబ్బంది పడుతున్న ఇబ్బందులను గ్రామస్థులు గుర్తు చేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఐదు నెలల జీతాలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేసి, పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి చేర్చుకోవాలని, తద్వారా శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.