
నారావారిపల్లెలో సంక్రాంతి వేడుకలు
ముగ్గుల, క్రీడా పోటీల్లో పాల్గొన్న లోకేష్
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో నారా లోకేష్ పాల్గొన్నారు. ముందుగా టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించారు. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించారు. ఈ పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి.
వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి బహుమతులు అందజేశారు. ఈ వేడుకల్లో భాగస్వాములైన ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందిని సన్మానించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందితో కలిసి అతిథులు గ్రూప్ ఫోటోలు దిగారు.
ఈ కార్యక్రమంలో నారా బ్రాహ్మణి, తేజస్విని, భరత్, నారా రోహిత్, నారా కుటుంబ సభ్యులు, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అలాగే పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, అనిమిని రవినాయుడు తదితరులు హాజరయ్యారు.
#SankrantiCelebrations
#Naravaripalle
#NaraLokesh
#StudentSports
#CulturalEvents
#AndhraPradeshNews
#LocalNews
#FestivalVibes
Follow us on
Website
Facebook
Instagram
YouTube