BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

స్టేషన్ బెయిల్‌పై రాజకీయ రంగు అక్కర్లేదు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 05:54 AM
130 వీక్షణలు

స్టేషన్ బెయిల్‌పై రాజకీయ రంగు అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ మంజూరు అంశంపై వస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పోలీసుల రూల్స్ ప్రకారమే బెయిల్ ఇచ్చారని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

హై-ప్రొఫైల్ కేసుల్లో రాజకీయ ఒత్తిడి ఉంటుందనే ఆరోపణలు సహజమని పేర్కొన్న సీఎం, ఈ కేసులో విచారణాధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ఎంపీకి బెయిల్ లభించడం చట్టపరమైన ప్రక్రియలో భాగమే తప్ప, రాజకీయ జోక్యం లేదని చెప్పారు. దీంతో తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ముందుగానే తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

సిట్ తన పని తాను చేసుకుంటుందని, విచారణలో ఎవరినీ వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు. డీజీపీ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ తెలిపారు. కేవలం ఫామ్‌హౌస్ దాడికి పరిమితం కాకుండా డ్రగ్స్ మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో డ్రగ్స్ కేసులు నీరుగారిపోయాయనే విమర్శలు ఉన్న నేపథ్యంలో, ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నిందితులు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానులేనని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు.