BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

స్టేషన్ బెయిల్‌పై రాజకీయ రంగు అక్కర్లేదు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 05:54 AM
90 వీక్షణలు

స్టేషన్ బెయిల్‌పై రాజకీయ రంగు అక్కర్లేదు: సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం

హైదరాబాద్: డ్రగ్స్ కేసులో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ కు స్టేషన్ బెయిల్ మంజూరు అంశంపై వస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. పోలీసుల రూల్స్ ప్రకారమే బెయిల్ ఇచ్చారని, ఇందులో ప్రభుత్వ ప్రమేయం ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

హై-ప్రొఫైల్ కేసుల్లో రాజకీయ ఒత్తిడి ఉంటుందనే ఆరోపణలు సహజమని పేర్కొన్న సీఎం, ఈ కేసులో విచారణాధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. ఎంపీకి బెయిల్ లభించడం చట్టపరమైన ప్రక్రియలో భాగమే తప్ప, రాజకీయ జోక్యం లేదని చెప్పారు. దీంతో తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ముందుగానే తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

సిట్ తన పని తాను చేసుకుంటుందని, విచారణలో ఎవరినీ వదిలిపెట్టబోమని సీఎం స్పష్టం చేశారు. డీజీపీ పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో మాదకద్రవ్యాల వ్యాప్తిని అరికట్టడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ తెలిపారు. కేవలం ఫామ్‌హౌస్ దాడికి పరిమితం కాకుండా డ్రగ్స్ మూలాలను పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో డ్రగ్స్ కేసులు నీరుగారిపోయాయనే విమర్శలు ఉన్న నేపథ్యంలో, ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

నిందితులు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా చట్టం ముందు అందరూ సమానులేనని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పునరుద్ఘాటించారు.