BREAKING
స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని ​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ లోన్‌కు ష్యూరిటీ ఇస్తే జాగ్రత్త.. ష్యూరిటీదారుడికీ సమాన బాధ్యతే పర్వతాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు జనార్ధనవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ​ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని ​మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిపై పెరిగిన రోగుల భారం లక్షద్వీప్‌కు చేరుకున్న నైరుతి రుతుపవనాలు: ఐఎండీ ఎన్టీఆర్‌ 103వ జయంతి.. నివాళులు అర్పించిన జూనియర్‌ ఎన్టీఆర్‌ లోన్‌కు ష్యూరిటీ ఇస్తే జాగ్రత్త.. ష్యూరిటీదారుడికీ సమాన బాధ్యతే పర్వతాపురంలో ఘనంగా ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు జనార్ధనవరంలో ఘనంగా అన్న ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు ​ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి ఘనంగా నాదెండ్ల మండల క్లస్టర్-1 మహానాడు కార్యక్రమం
www.ntodaynews.com

స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 May, 2026 - 04:18 PM
39 వీక్షణలు

స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలి: అత్తులూరి శ్రీనివాసరావు

చాట్రాయి మండలం చిన్నంపేట గ్రామంలో క్లస్టర్-1 పరిధిలో మహానాడు మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు, నూజివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ అత్తులూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రతి కార్యకర్త స్థానిక ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంలో కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని, అప్పుడే స్థానిక ఎన్నికల్లో విజయాన్ని సులభంగా సాధించగలమని అన్నారు.

నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు, చనుబండ సహకార సంఘ అధ్యక్షులు మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజలు గొడ్డలి పార్టీని తిరస్కరించారని, గ్రామస్థాయిలో ప్రతి కార్యకర్త సమన్వయంతో పని చేస్తే విజయం ఖాయమని తెలిపారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను ప్రజలకు అందుబాటులో ఉండే మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని కోరారు.

గత ఐదేళ్లలో మండలం అభివృద్ధికి దూరమైందని, మంత్రి పార్థసారథి నాయకత్వంలో మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అందరూ సంఘటితంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత బొట్టు లక్ష్మణరావు రావు, మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తేళ్లూరి శేఖర్, బొట్టు రామచంద్రరావు, మందలపు జగదీష్, నక్కా రాము, నక్కా సీతారత్నం, పుచ్చకాయల నోబుల్ రెడ్డి, చీదిరాల మారేశ్వరరావు, మంకెన పూర్ణ చంద్ర రావు, కాలసాని సూర్య నారాయణ, గార్లపాటి మారేశ్వరరావు, తల్లాడ శ్రీనివాసరావు, బుబత్తుల చెన్నారావు, మిద్దె సత్యనారాయణ, బొర్రా నాగేశ్వరరావు, పానుగంటి చెన్నకేశవులు, మిద్దె  మురళి, చీపు మల్లేశ్వరరావు,  చిమటబోయిన పుల్లారావు, ధారావతు భాస్కరరావు,గ్రంధాల జయప్రకాష్,ధారావతు మంగయ్య, రాజబోయిన దశరధ రామరాజు, లావూరి వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.