BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

స్వీడన్ అత్యున్నత పురస్కారంతో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కారం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 05:34 PM
84 వీక్షణలు

స్టాక్‌హోమ్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. స్వీడన్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన “రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్”లోని “కమాండర్ గ్రాండ్ క్రాస్” బిరుదుతో మోదీని సత్కరించింది. విదేశీ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలకు స్వీడన్ అందించే అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

భారత్–స్వీడన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య మరియు సాంకేతిక సహకార విస్తరణలో ప్రధాని మోదీ చేసిన కృషికి గుర్తింపుగానే ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు స్వీడన్ ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠను మరింత పెంచుతున్న మోదీకి లభించిన ఇది 31వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషంగా మారింది.

స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అక్కడి ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక సమావేశాల్లో వాణిజ్యం, హరిత ఇంధనం, ఆధునిక సాంకేతికత, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై కీలక చర్చలు జరిపినట్లు సమాచారం.