BREAKING
మంచిర్యాల గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం నల్గొండ జిల్లాలో పారిశ్రామిక మాక్ డ్రిల్ ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర! ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం.. నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్? ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి మంచిర్యాల గురుకుల డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం నల్గొండ జిల్లాలో పారిశ్రామిక మాక్ డ్రిల్ ఆమడగూరు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సిబ్బందిపై రైతులు కన్నెర! ఆటో కు తాళ్లు కట్టి వినూత్ననిరసన తెలిపిన ఆర్ సి పి నాయకులు ఇంధన పొదుపులో ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆదర్శం రెండు ఫోటోల విధానంతో ఉపాధి హామీ కూలీలకు ఇబ్బందులు: వి నాగరాజు ఫాసిస్ట్ శక్తులను ఓడించాలి.. వామపక్షాలే ప్రత్యామ్నాయం: డి హరినాథ్ జై భీమ్ భవనానికి రూ.25 వేల విరాళం.. నూజివీడు జనసేనలో బర్మా ఫణి బాబు హవా.. ఇన్చార్జ్ పదవికి మళ్లీ గ్రీన్ సిగ్నల్? ఏపీలో రూ.2500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ భారీ పెట్టుబడి
www.ntodaynews.com

స్వీడన్ అత్యున్నత పురస్కారంతో ప్రధాని నరేంద్ర మోదీకి సత్కారం

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
18 May, 2026 - 05:34 PM
26 వీక్షణలు

స్టాక్‌హోమ్: భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. స్వీడన్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన “రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్”లోని “కమాండర్ గ్రాండ్ క్రాస్” బిరుదుతో మోదీని సత్కరించింది. విదేశీ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలకు స్వీడన్ అందించే అత్యున్నత గౌరవాల్లో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది.

భారత్–స్వీడన్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వాణిజ్య మరియు సాంకేతిక సహకార విస్తరణలో ప్రధాని మోదీ చేసిన కృషికి గుర్తింపుగానే ఈ పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు స్వీడన్ ప్రభుత్వం వెల్లడించింది. అంతర్జాతీయ వేదికలపై భారత ప్రతిష్ఠను మరింత పెంచుతున్న మోదీకి లభించిన ఇది 31వ అంతర్జాతీయ పురస్కారం కావడం విశేషంగా మారింది.

స్వీడన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అక్కడి ప్రధాని ఉల్ఫ్ క్రిస్టర్సన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ద్వైపాక్షిక సమావేశాల్లో వాణిజ్యం, హరిత ఇంధనం, ఆధునిక సాంకేతికత, రక్షణ రంగాల్లో పరస్పర సహకారం పెంపుపై కీలక చర్చలు జరిపినట్లు సమాచారం.