BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

శ్రీ స్వామి అమ్మవార్లకు దూపసమర్పణ

భక్తి భక్తి
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
01 Apr, 2026 - 07:37 PM
65 వీక్షణలు

శ్రీ స్వామి అమ్మవార్లకు దూపసమర్పణ 

శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం 

 తేది:  01.04.2026

శ్రీ స్వామిఅమ్మవార్లకు ధూపసమర్పణ

ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సాయంకాలాన స్వామిఅమ్మవార్లకు విశేషంగా ధూపాన్ని సమర్పించడం ( దవనోత్సవం)   సంప్రదాయం.

చైత్రపౌర్ణమి సందర్భంగా బుధవారం (01.04.2026) సాయంకాలం ఈ ధూపసమర్పణ జరిపించబడింది.  

ఈ కార్యక్రమములో సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ రాజగోపురానికి ఎదురుగా అగ్నిప్రతిష్ఠాపన చేసి ఆజ్యం, దవనం, గుగ్గిలం ఆహుతిగా వేసి శ్రీస్వామిఅమ్మవార్లకు ధూపసమర్పణ చేయబడింది.

ఈ సమర్పణలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత శాస్త్రోక్తంగా అగ్నిప్రతిష్ఠాపనాది కార్యక్రమాలు జరిపి ధూపసమర్పణ జరిపించబడింది. 

ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి  తదితరులు పాల్గొన్నారు.

కాగా ప్రతి సంవత్సరం ఈ ధూపసమర్పణలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. 

( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)

శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ