శ్రీ స్వామి అమ్మవార్లకు దూపసమర్పణ
శ్రీ స్వామి అమ్మవార్లకు దూపసమర్పణ
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం
తేది: 01.04.2026
శ్రీ స్వామిఅమ్మవార్లకు ధూపసమర్పణ
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సాయంకాలాన స్వామిఅమ్మవార్లకు విశేషంగా ధూపాన్ని సమర్పించడం ( దవనోత్సవం) సంప్రదాయం.
చైత్రపౌర్ణమి సందర్భంగా బుధవారం (01.04.2026) సాయంకాలం ఈ ధూపసమర్పణ జరిపించబడింది.
ఈ కార్యక్రమములో సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ రాజగోపురానికి ఎదురుగా అగ్నిప్రతిష్ఠాపన చేసి ఆజ్యం, దవనం, గుగ్గిలం ఆహుతిగా వేసి శ్రీస్వామిఅమ్మవార్లకు ధూపసమర్పణ చేయబడింది.
ఈ సమర్పణలో ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సంకల్పాన్ని పఠించారు. తరువాత శాస్త్రోక్తంగా అగ్నిప్రతిష్ఠాపనాది కార్యక్రమాలు జరిపి ధూపసమర్పణ జరిపించబడింది.
ఈ కార్యక్రమములో కార్యనిర్వహణాధికారి తదితరులు పాల్గొన్నారు.
కాగా ప్రతి సంవత్సరం ఈ ధూపసమర్పణలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు.
( కార్యనిర్వహణాధికారి ఉత్తర్వుల మేరకు)
శ్రీశైలదేవస్థానం వారి ద్వారా జారీ