www.ntodaynews.com
శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
తెలంగాణ
నాగపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో మద్దుల గోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు
NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్
వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట గ్రామ శివారులో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం నాగపల్లి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు, PACS మాజీ చైర్మన్ మద్దుల గోపాల్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆలయానికి విచ్చేసిన మద్దుల గోపాల్ రెడ్డికి ఆలయ కమిటీ చైర్మన్ అజయ్ ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనాలు అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ తరఫున అజయ్ మద్దుల గోపాల్ రెడ్డిని శాలువాతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారిలో కందికట్ల అమృత రాజేష్, పూధరి రమేష్, మెరుగు నరేష్, బెడ్డల ప్రవీణ్, ధర్శనాల నరేష్, నీలం శ్రీనివాస్, కొడిపేల్లి శ్రీనివాస్, బాలసాని మల్లేశం, సింగతి వెంకటస్వామి మరియు ఉమ్మడి మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#Velgatoor #Nagapalli #LakshmiNarasimhaSwamy #TempleVisit #MaddulaGopalReddy #TelanganaNews #Jagtial #NTodayNews
Follow us on
Website
Facebook
Instagram
YouTube