BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఫాలధార–పంచధార వద్ద విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం

తెలంగాణ
07 Mar, 2026 - 06:56 AM
211 వీక్షణలు
మార్చి 8న ఫాలధార–పంచధార వద్ద విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం NTODAY NEWS: శ్రీశైలం, నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున శ్రీశైల దేవస్థానం పరివార దేవాలయమైన ఫాలధార–పంచధార వద్ద ఈ నెల 8వ తేదీన శ్రీ శారదాంబా సహిత జగద్గురు ఆదిశంకరాచార్యుల నూతన విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం దక్షిణామ్నాయ శృంగేరి శారదాపీఠం జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామివారి కరకమలాలచే నిర్వహించబడుతుంది. రేపు ఉదయం 8 గంటలకు ఫాలధార–పంచధార వద్ద ఏర్పాటు చేసిన యాగశాలలో అధివాస హోమాలు, నూతన విగ్రహాలకు నేత్రోన్మీలన కార్యక్రమం అనంతరం పూర్ణాహుతి జరుగుతుంది. తదుపరి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఫాలధార–పంచధారలోని నూతన ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠా కార్యక్రమాలు మార్చి 6న ప్రారంభమయ్యాయి. మొదటి రోజు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం, ఋత్విగ్వరణం, మండపారాధన, చతుర్వేద పారాయణం మరియు నూతన విగ్రహాలకు జలాధివాస కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం క్షీరాధివాసం మరియు అధివాస హోమాలు జరిపించారు. రెండవ రోజైన మార్చి 7న ఉదయం నూతన విగ్రహాలకు ధాన్యాధివాస కార్యక్రమం నిర్వహించగా, సాయంత్రం పుష్పాధివాసం, శయ్యాధివాసం మరియు అధివాస హోమాలు నిర్వహించనున్నారు. అనంతరం మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. మార్చి 8న జరిగే విగ్రహ ప్రతిష్ఠతో ఈ కార్యక్రమాలు ముగియనున్నట్లు దేవస్థానం వెల్లడించింది. #Srisailam #Adishankaracharya #PhaladharaPanchadhara #TempleNews #SpiritualEvents #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube