స్వచ్ఛంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమం
NTODAY NEWS: అమడగూరు రిపోర్టర్ రామాంజనేయులు
శ్రీ సత్య సాయి జిల్లా, అమడగూరు మండలంలో స్వచ్ఛంద్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంను శనివారం పంచాయతీ, సిబ్బంది, ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు నెలలో మూడో శనివారంను స్వచ్ఛంద్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంను నిర్వహించాలనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీహెచ్ఎస్ స్కూల్,జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులచే గ్రామంలో ర్యాలీ నిర్వహించి, స్వచ్ఛ్ ఆంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం పంచాయతీ, సిబ్బంది స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వీధులలోకి చెత్తాచెదారం, మురుగునీటిని వదలరాదని తెలియజేశారు. భోజనానికి ముందు, తర్వాత చేతులను పరిశుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం తాసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో ఆఫీస్, జడ్పీహెచ్ఎస్ స్కూల్, పరిసరాలలో పరిశుభ్రం చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మునేప్ప, ఎంఈఓ జిలాన్ భాష,ఈ, ఓ,ఆర్ డీ, మల్లికార్జున్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు, మమత ఉపాధ్యాయులు రమణారెడ్డి సిబ్బంది విద్యార్థులు పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube