BREAKING
సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం సింహాద్రిపురం వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు 30 ఏళ్ల నిరీక్షణకు తెర.. వెలిగొండతో ప్రకాశం వెలుగు! అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి భూమిపూజ గుంటూరులో దారుణ హత్య..... తెలుగు భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాష పై ఒక చిన్న కవిత్వం వర్షాల కోసం మునగపాకలో రైతుల కప్పల పెళ్లిళ్లు కడప నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముద్దనూరులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ముద్దనూరు పోలీస్ స్టేషన్‌లో రక్తదాన శిబిరం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
Date of Publish : 19 March 2026, 10:30 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరుకు కొత్త ఆర్డీఓ… ఏ. కుమార్ ఎంట్రీతో పరిపాలనకు నూతన వేగం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Mar, 2026 - 10:30 AM
127 వీక్షణలు

తిరువూరుకు కొత్త ఆర్డీఓ… ఏ. కుమార్ ఎంట్రీతో పరిపాలనకు నూతన వేగం!

ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు రెవిన్యూ డివిజనల్ అధికారిగా ఏ. కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో జరిగిన స్వీకార కార్యక్రమం సందర్భంగా అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కొత్త ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో వేగం పెంచే దిశగా చర్యలు ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడం, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం తన ప్రాధాన్యంగా ఉంటుందని ఏ. కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.

తిరువూరులో అభివృద్ధి పనులకు ఊపు తెచ్చేలా సమన్వయంతో పనిచేస్తానని, అధికార యంత్రాంగం ప్రజల వద్దకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. కొత్త ఆర్డీఓ రాకతో తిరువూరు రెవెన్యూ వ్యవస్థలో మార్పులు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.