తిరువూరుకు కొత్త ఆర్డీఓ… ఏ. కుమార్ ఎంట్రీతో పరిపాలనకు నూతన వేగం!
తిరువూరుకు కొత్త ఆర్డీఓ… ఏ. కుమార్ ఎంట్రీతో పరిపాలనకు నూతన వేగం!
ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు: తిరువూరు రెవిన్యూ డివిజనల్ అధికారిగా ఏ. కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలో జరిగిన స్వీకార కార్యక్రమం సందర్భంగా అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. కొత్త ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో వేగం పెంచే దిశగా చర్యలు ప్రారంభించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడం, పెండింగ్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం తన ప్రాధాన్యంగా ఉంటుందని ఏ. కుమార్ పేర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని, ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేయాలని సూచించారు.
తిరువూరులో అభివృద్ధి పనులకు ఊపు తెచ్చేలా సమన్వయంతో పనిచేస్తానని, అధికార యంత్రాంగం ప్రజల వద్దకు వెళ్లే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. కొత్త ఆర్డీఓ రాకతో తిరువూరు రెవెన్యూ వ్యవస్థలో మార్పులు ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.