BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

తల్లి ఆశీస్సులతో సీఎం పీఠం అధిరోహించిన డీకే శివకుమార్

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Jun, 2026 - 06:16 PM
49 వీక్షణలు

తల్లి ఆశీస్సులతో సీఎం పీఠం అధిరోహించిన డీకే శివకుమార్

కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు డీకే శివకుమార్ తన తల్లి గౌరమ్మ ఆశీర్వాదం తీసుకుని అందరి దృష్టిని ఆకర్షించారు. అనంతరం రాజకీయాలకు అతీతంగా రాష్ట్రంలోని సీనియర్ నాయకులను స్వయంగా కలిసి ఆహ్వానించారు.

మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప, మాజీ ప్రధాని దేవెగౌడలను కలిసిన డీకే శివకుమార్.. రాష్ట్ర అభివృద్ధి కోసం రాజకీయ భేదాలను పక్కనబెట్టి అందరి అనుభవాన్ని వినియోగించుకుంటానని తెలిపారు.

ఆ తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేయగా, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లోత్ ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర ప్రమాణ స్వీకారం చేయగా, మరో 13 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. స్పీకర్‌గా హెచ్‌కే పాటిల్ బాధ్యతలు చేపట్టనుండగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో సిద్ధరామయ్య కీలక పాత్ర పోషించనున్నారు.

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తదితర ప్రముఖులు హాజరయ్యారు.

లోక్ భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో యడ్యూరప్ప, దేవెగౌడ తదితరులు డీకే శివకుమార్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.