తొర్రూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కు సన్మానం
తొర్రూరు మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ కు సన్మానం
తొర్రూరు
ఇటీవల ఎన్నికైన తొర్రూరు మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ లను శ్రీ శ్రీ శ్రీ సగర భగీరథ మహర్షి జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో సగర సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఎంపీ ఈటల రాజేందర్, సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సగర, రాష్ట్ర కోశాధికారి కార్యదర్శి వడ్లకొండ కుమారస్వామి సగర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యం సగర, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు స్రవంతి సగర, మారుతి సగర, హరికిషన్ సగర లు శాలువా కప్పి మెమొంటో అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతురాలు, సగర బిడ్డ చిన్న వయసులో మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం సగర కులానికి గర్వకారణమని అన్నారు. ప్రజా సేవలో ముందుండి మంచి ప్రజా ప్రతినిధిగా గుర్తింపు తీసుకురావాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్ మాట్లాడుతూ తమను సగర రాష్ట్ర కమిటీ, సగర కులస్తులు సన్మానం చేయడం సంతోషంగా ఉందన్నారు.