BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

తప్పుడు వార్తలను నమ్మకండి పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ కొరత లేదు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
27 Mar, 2026 - 08:53 AM
148 వీక్షణలు

తప్పుడు వార్తలను నమ్మకండి పెట్రోల్, డీజిల్ మరియు వంటగ్యాస్ కొరత లేదు ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదు--జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లాలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ (LPG) కొరత లేదు – భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి జిల్లాలోని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గురువారం రోజున అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో  జిల్లాలోని సేల్స్ ఆఫీసర్స్ మరియు  పెట్రోల్ బంకుల యజమానులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడ కూడా నో - స్టాక్ బోర్డులు పెట్టకూడదని, ముందస్తు స్టాక్ బుకింగ్ చేసుకోవాలని, స్టాక్ 24 గంటలలో డెలివరీ చేయాలని సేల్స్ ఆఫీస్సర్లకు సూచించారు మరియు పెట్రోల్ బంకులలో మౌలిక సదుపాయాలు ఉండాలని ఆదేశించారు జిల్లాలో ఎక్కడా కూడా  పెట్రోల్, డీజిల్ లేదా వంట గ్యాస్ (LPG) కొరత లేదని, ఆయిల్ రిఫైనరీల నుండి స్థానిక డిపోల వరకు ఇంధన సరఫరా యంత్రాంగం పూర్తిగా,సక్రమంగా పని చేస్తుందన్నారు.జిల్లా ప్రజల రోజువారీ అవసరాలను తీర్చడానికి సరిపడా ఇంధన నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.కొన్ని పెట్రోల్ బంకులలో తాత్కాలిక “No Stock” బోర్డులు కనిపించడం, తప్పు వదంతుల వల్ల ప్రజలు panic లో ఇంధనం కొనుగోలు చేయడం వల్లనే జరుగుతుంది. భయం వల్ల ప్రజలు ఒక్కసారిగా ఎక్కువ ఇంధనం కొనుగోలు చేయడం వల్ల సాధారణం కంటే 2.5 – 3 రెట్లు విక్రయాలు పెరిగాయి. పెట్రోల్ లేదా డీజిల్ ను డబ్బాలు / క్యాన్లలో నిల్వ చేయడం PESO నిబంధనలకు విరుద్ధం. ఇది అగ్ని ప్రమాదాలకు దారి తీయవచ్చు. అక్రమ నిల్వ, బ్లాక్ మార్కెట్ జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాము అని అన్నారు ఓఎంసీ ల అడ్వాన్స్ పేమెంట్  మార్పుల వల్ల స్థానిక డీలర్లకు తాత్కాలిక సమస్యలు మాత్రమే ఏర్పడ్డాయి, సరఫరాలో లోపం లేదు అని అన్నారు అదనపు కలెక్టర్ జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు భయాందోళనలతో ఇంధనాన్ని కొనుగోలు చేయవద్దు అని,తమకు అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయండి అని అన్నారు ప్రభుత్వ అధికారిక ప్రకటనలను మాత్రమే నమ్మండి. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను నమ్మకండి / ఇతరులకు పంపకండి అని జిల్లా ప్రజలకు సూచించారు