www.ntodaynews.com
పెద్దమ్మ తల్లి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
తెలంగాణ
పెద్దమ్మ తల్లి ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ
వసంత పంచమిని పురస్కరించుకుని గ్రామంలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో చిన్న పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీబీనగర్ ఎంఈఓ సురేందర్ రెడ్డి, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు గుమ్మడి ఉమాదేవి, కడెం ఉమాదేవి, పాండురంగం, ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మ పాల్గొన్నారు.
అలాగే మాజీ జెడ్పిటిసి భాషబోయిన పెంటయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ వాకిటి సంజీవరెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రంగు కృష్ణవేణి, గోపాల్ గౌడ్, పెద్దమ్మ తల్లి ఆలయ చైర్మన్ భువనగిరి బాల్ నరసింహ, దేవస్థానం చైర్మన్ గాండ్ల బాలరాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు కాడిగళ్ళ బాబురావు, కనకబోయిన కిషోర్, కడెం అశోక్, భానుశ్రీ వేణు, రజిత భాస్కర్, మంద భాస్కర్, కడెం సంపూర్ణ కిరణ్తో పాటు అంగన్వాడి టీచర్ శోభారాణి, రాజమల్లేష్, బాల్రాజ్, ఎట్టయ్య, దేశం శ్రీకాంత్ గౌడ్, అంజయ్య, మల్లేష్, నరసింహ నవీన్ పాల్గొన్నారు.
ఆలయ పురోహితులు సురేష్ పంతులు వేదమంత్రాల మధ్య చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.
#Aksharabhyasam
#VasanthaPanchami
#TempleEvent
#ChildrenEducation
#IndianTradition
#VillageCulture
#DevotionalEvent
#BBNagar
Follow us on
Website
Facebook
Instagram
YouTube