www.ntodaynews.com
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
తెలంగాణ
బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి
NTODAY NEWS : చిట్యాల
అతివేగంగా ద్విచక్ర వాహనం నడపడంతో అదుపుతప్పి వ్యక్తి మృతి చెందిన సంఘటన చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులోని 65వ జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మెహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం రేపోణి గ్రామానికి చెందిన పగిండ్ల ఉప్పలయ్య (50) టీజీ 07 ఏసీటి ఆర్ 1566 నెంబర్ గల తన ద్విచక్ర వాహనంపై హైదరాబాద్కు వెళ్తుండగా, చిట్యాల మండలం గుండ్రంపల్లి గ్రామ శివారులో అతివేగంగా అజాగ్రత్తగా బైక్ నడపడంతో అదుపుతప్పి రోడ్డుపక్కన ఉన్న ప్రమాద సూచిక బోర్డును ఢీకొట్టాడు. అనంతరం చెట్టుకు ఢీకొనడంతో తలకు బలమైన గాయాలయ్యాయి.
అటుగా వెళ్తున్న ప్రయాణికులు ప్రమాదాన్ని గమనించి వెంటనే గాయపడిన వ్యక్తిని చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని కామినేని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మామిడి రవికుమార్ తెలిపారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube